- You cannot add "విప్లవం అంటే ఏమిటి? భగత్ సింగ్" to the cart because the product is out of stock.
తొలి దళిత ఆత్మ గౌరవ స్వరం కుసుమ ధర్మన్న కవి
₹45.00
పేజీలు : 56
ధర్మన్న పట్ల గౌరవంతో, ఆరాటంతో చాలా విషయాలు అన్వేషించింది ఆచార్య మధుజ్యోతి. ఏ మామూలు పరిశోధకులైనా తీవ్రంగా వ్యవహరించే సందర్భాలలోకూడా ఆమె సంయమనంతో సూచనలు మాత్రమే చేసి, సహృదయుల నిశ్చయానికి మార్గం చూపింది. ‘మాకొద్దీ తెల్ల దొరతనం’, ‘మాకొద్దీ నల్లదొరతనం’ పాటలు రచనలో పూర్వాపరాలు నిర్ణయించటానికి చేసిన యుక్తులు శక్తిమంతంగా ఉన్నాయి. ధర్మన్న ‘హరిజనశతకం’ ఎంత ఆగ్రహోదగ్రంగా ఉందో ఈమె విడమర్చి చూపింది. ఉపన్యాస సమాచారం తీరుతెన్నులు తెలిపింది. లభించకపోయినా, వ్రాశాడని తెలిసిన కథానికల్ని గూర్చి ప్రస్తావించింది. ధర్మన్న ఉపన్యాసాలలో అగ్నికురవటం, జ్వాలలు రేగటం దర్శించింది. – ఆచార్య కొలకలూరి ఇనాక్
Reviews
There are no reviews yet.