తెలంగాణా సాయుధ పోరాటం శౌర్యగాథలు, నా అనుభవాలు

60.00

పేజీలు : 120
కోటి మంది తెలంగాణ ప్రజలను ఉక్కుపాదంతో అణచిపెట్టి, వారి భావ సంస్క ృతులను కాలరాచి, కరకు రాచరికం చేసిన వాడు నిజాం. ఆ పాలనపై తిరుగుబాటు చేసిన తెలుగు ప్రజలకు నేతృత్వం వహించింది నాటి కమ్యూనిస్టు పార్టీ. నిజాంపై సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి అసమాన ధైర్య సాహసాలతో ముందుకు దూకిన కొదమసింహాలు కమ్యూనిస్టులు. వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గెరిల్లా పోరాటాలు సాగించారు. నిజాం ప్రభుత్వ స్థైర్యాన్ని ఘోరంగా దెబ్బతీశారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో, పాల్గొన్న వీర కిశోరం దుంపల మల్లారెడ్డిగారు. ఆ పోరాట యోధుడు నాటి జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసి భావితరాలకు మహోపకారం చేశారు. – తిరునగరి

Reviews

There are no reviews yet.

Be the first to review “తెలంగాణా సాయుధ పోరాటం శౌర్యగాథలు, నా అనుభవాలు”

Your email address will not be published. Required fields are marked *